calender_icon.png 12 October, 2024 | 3:17 AM

బీరుట్‌పై ఇజ్రాయెల్ దాడి

12-10-2024 12:55:48 AM

22 మంది మృతి.. 117 మందికి గాయాలు

బీరుట్, అక్టోబర్ 11: హెజ్బొల్లా టాప్ కమాండర్లే టార్గెట్‌గా ఇజ్రాయెల్ భీకర దాడులు కొనసాగుతు న్నాయి. ఈ సంస్థలోని ఉన్నత శ్రేణి నాయకత్వాన్ని మొత్తం చంపేసిన ఇజ్రాయెల్.. తాజాగా రెండోశ్రేణి నేతలపై దృష్టిపెట్టింది. హెజ్బొల్లా గ్రూప్ భద్రత, రాజకీయ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న వఫిక్ సఫాను చంపటమే లక్ష్యంగా ఇజ్రాయెల్ గురువారం బీరుట్‌పై వైమానిక దాడులు చేసింది.

ఈ దాడిలో 22 మంది మరణించారు. 117 మంది గాయపడ్డారు. అయితే, ఆ సమయంలో సఫా అక్కడ లేకపోవ టంతో ప్రాణాలతో బయటపడ్డారని హెజ్బొల్లాకు చెందినర ఏఐ మనార్ టీవీ శుక్రవారం ప్రకటించింది. ఇజ్రాయెల్ దాడి విఫలమైందని పేర్కొన్నది. ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు వేసిన భారీ బాంబుల ధాటికి 8 అంతస్తుల భవనం పేకమేడలా కూలిపో యింది. దాని చుట్టుపక్కల ఉన్న భవనాలు కూడా నేలమట్టమయ్యాయి.