calender_icon.png 28 October, 2024 | 5:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇస్మార్ట్ శంకరే.. ఔర్ ఏక్ బార్ ఆయారే..

02-07-2024 12:05:00 AM

‘ఇస్మార్ట్ శంకరే.. ఔర్ ఏక్ బార్ ఆయారే’ అంటూ హల్ చేస్తున్నారు హీరో రామ్. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఆయన కథానా యకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి సోమవారం తొలి గీతా న్ని విడుదల చేశారు. ‘నిప్పెట్టిన పటాకే.. డబులు దిమాకే’ అంటూ భాస్కరభట్ల రాసిన ఈ గీతానికి జానీ మాస్టర్ సమకూర్చిన నృత్యాలతో చెలరేగిపోయారు రామ్. మణిశర్మ బాణీలందించిన ఈ స్టెప్పామార్ పాటని గాయకులు అనురాగ్ కులకర్ణి, సాహితి పాడారు. పూరీ కనెక్ట్స్ నిర్మాణంలో పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్ రూపొందిస్తున్న ఈ సినిమా ఆగస్టు 15న విడుదల కానుంది. సంజయ్ దత్, కావ్య థాపర్, అలీ, గెటప్ శ్రీను కీలక పాత్రల్లో కనపడనున్నారు.