calender_icon.png 9 October, 2024 | 5:56 PM

నేటి నుంచి ఐసెట్ స్పాట్ కౌన్సెలింగ్

09-10-2024 02:04:26 AM

హైదరాబాద్, అక్టోబర్ 8 (విజయక్రాంతి): ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఐసెట్ స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియను బుధవారం నుంచి చేపట్టనున్నట్లు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన తెలిపారు. కళాశాలలు 10వ తేదీన న్యూస్ పేపర్లలో నోటిఫికేషన్‌ను వేయాలని సూచించారు. 15, 16వ తేదీల్లో సీట్లను అభ్యర్థులకు కేటాయించనున్నారు. ఇతర వివరాలకు అభ్యర్థులు  వెబ్‌సైట్‌ను సందర్శించాలని విద్యాశాఖ కమిషనర్ సూచించారు.