హైదరాబాద్, సెప్టెంబర్ 19 (విజయక్రాంతి): ఐసెట్ తుది విడుత కౌన్సెలింగ్ శుక్రవారం నుంచి ప్రారం భం కానుందని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన తెలిపారు. ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి విద్యార్థులు స్లాట్ బుక్ చేసుకోవాలని వెల్లడించారు. శనివారం సర్టిఫికెట్ వెరిఫికే షన్ ప్రక్రియ చేపట్టనున్నారు. శని, ఆదివారాల్లో వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించారు. సీట్ల కేటాయింపు వివరాలను త్వరలో వెల్లడించనున్నారు. ఇతర వివరాలకు ఐసెట్ అధికారిక వెబ్సైట్ను సందర్శించాలని శ్రీదేవసేన సూచించారు.