calender_icon.png 24 October, 2024 | 12:55 AM

బచ్చన్ రాకకు ముహూర్తం ఖరారు?

21-07-2024 12:15:23 AM

రవితేజ, హరీష్ శంకర్ కలయికలో తెరకెక్కిన తాజా చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. ‘షాక్’, ‘మిరపకాయ్’ చిత్రాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో రానున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మేరకు నిర్మాణ వర్గాలు తగిన తేదీ కోసం చర్చలు సాగిస్తుండగా, అవి ఓ కొలిక్కి వచ్చినట్టు సమాచారం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాని ఆగస్టు 14న తెరమీదికి తీసుకురానున్నారట దర్శక నిర్మాతలు. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. బాలీవుడ్ చిత్రం ‘రెయిడ్’కి పునర్నిర్మితంగా రూపొందిన ఈ సినిమా ద్వారా భాగ్య శ్రీ బోర్సే కథానాయికగా పరిచయం కానుంది.

తొలి సినిమా విడుదలకు ముందే టాలీవుడ్లతో వరుస అవకాశాలను అందుకుంటున్న బోర్సే, ఇటీవల విడుదలైన సితార్ సాంగ్తో తెలుగు యువత హదయాలను సుతారంగా మీటింది. ఈ పాట సైతం యూట్యూబ్లో 6 మిలియన్ వ్యూస్తో సంగీత ప్రియులను అలరిస్తోంది. జగపతి బాబు, సచిన్ ఖేడేకర్ తదితరు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకి మిక్కీ జే మేయర్ స్వరకర్తగా వ్యవహరిస్తున్నారు. ఇంతకుముందు హరీష్ దర్శకత్వం వహించిన ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’, ‘గద్దలకొండ గణేష్’ చిత్రాలకు మిక్కీ సంగీతం అందించగా.. వీరిద్దరి కలయికలోనూ ‘మిస్టర్ బచ్చన్’ సినిమా మూడవది కావడం విశేషం.