calender_icon.png 7 March, 2025 | 3:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్మార్ట్ ఫోన్ మిత్రుడా, శత్రువా?

23-02-2025 12:00:00 AM

స్మార్ట్ ఫోన్ లేని వాడు నేటి డిజిటల్ యుగపు మనిషే కాదు. ఇంటర్నెట్ వాడకపోతే దిగులు పెరుగుతుంది. వాట్సాప్, ఫేస్‌బుక్‌లు చూడకపోతే ముద్ద దిగదు. స్మార్ట్ ఫోన్ జేబులో లేక పోతే క్షణం గడవదు. స్మా ర్ట్ ఫోన్‌ను ఇంట్లో మరిచిపోతే ఊపిరి ఆగినంత పని అవుతుంది. అన్నింటి కన్నా స్మార్ట్ ఫోన్ మిన్న అయిపోయింది. ఇటీవల విదేశీ విశ్వవిద్యాల యం చేసిన సర్వేలో ఆసక్తికరమైన, ప్రమాదకర మైన అంశాలు వెలుగులోకి వచ్చాయి.

తమ ఆప్త మిత్రుల కన్న స్మార్ట్ ఫోన్ మిన్న అని 37 శాతం మంది అభిప్రాయపడగా, తమ తల్లిదండ్రుల కన్నా స్మార్ట్ ఫోన్ ముఖ్యమని 29 శాతం యువత తెలపడం మన స్మార్ట్ ఫోన్ బలహీనతను స్పష్టం చేస్తున్నది. మూడు నెలల పిల్లాడు సైతం స్మార్ట్ ఫోన్ బొమ్మ చూపకపోతే ముద్ద మింగడం లేదు. మన ముఖ్యమైన విధులను సైతం పక్కన పెట్టి స్మార్ట్‌ఫోన్ సామాజిక మాధ్యమ సాగరంలో ఈదుతున్నాం. నేడో రేపో స్మార్ట్ ఫోన్ షార్క్‌గా మారి మన భవిష్యత్తును మింగేయ చూస్తున్నది.

 స్మార్ట్ ఫోన్ ఎంత పని చేస్తున్నది ? నాతో నేను మాట్లాడడమే ఎప్పుడో మానేసా. అమ్మనాన్నలతో ముచ్చట్లు లేవు, స్నేహితులు పలుచబడుతున్నారు.  ఒంటరితనం మానసిక వ్యాధిగా మారుతున్నది. చికా కు పెరుగుతున్నది. అన్నం తినాలనిపించదు. మైదాన ఆటలు అంతరించి పోతున్నాయి. ఏకాగ్రత మంటగలుస్తున్నది. మానవ సంబంధాలు పలుచబడి పోతు న్నాయి.

భార్య సహితం పరాయి స్త్రీగా మిగిలి పోతున్నది. భార్యను భర్తకు, తల్లిని పిల్లకు, తండ్రిని కొడు కుకు, విద్యార్థిని చదువుకు దూరం చేస్తున్నది. తల్లితండ్రులు అవసరాలను తీర్చే యంత్రాలుగా మారిపో యారు. స్మార్ట్‌ఫోన్ ప్రమాదకరంగా మారి మానసిక, సమయ ఒత్తిడిని పెంచుతూ, ఆదుర్దా, నిరాశ, అనవసర ఆవేశాలకు ఆజ్యం పోస్తున్నది.

మన సాధారణ ప్రవర్తనను కొన్ని మాసాల్లో మార్చివేయగల అతి తెలివిగల సాధనంగా స్మార్ట్ ఫోన్ పోజులు కొడుతున్నది. ముఖ్యమైన పనిలో నిమగ్నమైన మరు క్షణమే ఫోన్ రింగ్ లేదా సామాజిక మాధ్యమ అలెర్ట్స్ మన దృష్టిని లాగేసుకుంటున్నాయి. ఆలిని వదలగలను కాని నా అందాల ఫోన్ సుందరిని వదలలేను అనే అకాలాలు వచ్చాయి. మనీపర్సు కూడా అవసరం లేదంటూ స్మార్ట్ ఫోన్ కాలర్ ఎగరేస్తున్నది. మనిషిని కట్టు బానిసను చేస్తున్నది. 

స్మార్ట్ ఫోన్‌కు దూరం జరగండి

మన స్మార్ట్ ఫోన్ సాహిత్యం శత్రువును జేబులో, టేబుల్ మీద, కప్ బోర్డులో లేదా చాలా దూరంగా పెట్టి మీ పనులు చేయడం ప్రారంభించండి., ఏది మనకు విజయాన్ని లేదా ఉత్పాదకతను పెంచుతుం ది, లేదా ఏది వైఫల్యాలను అంటకడుతుందో మీకే తెలుస్తుంది. స్మార్ట్ ఫోన్ జేబులో ఉంటే పని అసలే జరగదు. జేబుపై పెడితే 25 శాతం జరుగుతుంది. డ్రాలో వేస్తే 40 శాతం ఫలితాలు నమోదు అవుతాయి.

దూరం పెడితే మన సామర్థ్యానికి తగిన గరిష్ఠ ఉత్పాదకత రికార్డు అవుతుంది. విజయాలను వెంట వెంటనే బహుకరిస్తుంది. అంటే ఫోన్ దూరం అయిన కొద్దీ విజయాలు దగ్గరవుతాయి. విధి నిర్వహణ లేదా చదుకునే సమయాల్లో స్మార్ట్ ఫోన్ సందేశాలు, కాల్స్ అందనంత దూరంగా, ఆఫ్ చేసి పెట్డండి. సన్నిహిత వాట్సాప్ గ్రూపులు మినహా ఇతర అనవసర గ్రూపుల నుండి తొలగిపోదాం.

వార్తల యాప్‌లను సాయం త్రం వరకు దూరం పెడదాం. అతి ముఖ్యమైన కాల్స్ మాత్రమే చేద్దాం లేదా రిసీవ్ చేసుకుందాం. విడియో గేమ్స్, ఆడియో వ్యర్థ సమాచారాలకు దూరంగా ఉం దాం. మనకు అత్యవసరం అనుకున్నపుడు మాత్రమే అవసర సమాచారం కోసం ‘గూగులమ్మ’ తలుపులు తెరుద్దాం. ప్రతి అనవసర ప్రకటనలు లేదా సూచనలకు సమాధానాలు ఇవ్వవద్దు.

అవసరమైన ఆడియో లేదా వీడియోలను మా త్రమే ఉపయోగిద్దాం. సామాజిక మాధ్యమాలు మన మెదడును తినేస్తున్నాయి. మనల్ని బుద్ధిహీనులుగా మారుస్తున్నా యి. స్మార్ట్ ఫోన్ సాధనానికి స్వల్ప విరామమిచ్చి కుటుంబ సభ్యులతో కలిసి భో జనం చేయడం, వ్యాయామానికి సమ యం ఇవ్వడం, స్నేహితులతో అప్పుడప్పు డూ మాట్లాడడం, అమ్మనాన్నల ఆప్యాయతను రుచి చూడడం, భార్యతో కాలక్షేపం చేయ టం, ఏకాగ్రతతో చదవడం లాంటివి చేసి చూడండి, మీకే తెలుస్తుంది మీ మనసు ఎంత తేలిక అవుతుం దో, మానసిక ఒత్తిడి దిగిపోతుందో. అందరికీ రోజుకు 1440 నిమిషాల సమ యం మాత్రమే ఉంది.

మీరు దీనిలో ఎంత సమయం స్మార్ట్ ఫోన్ వినియోగానికి వెచ్చిస్తున్నారో అంచనా వేయండి. కొంత మంది 500 నుండి 600 నిమిషాల వరకు ఫోన్‌తోనే సం సారం తేస్తున్నారు. వీరికి అపజయాలు నిర్ధారణ అయినాయి. ఫోన్‌ను పక్కన పెట్టి పనిపై ఏకాగ్రత పెంచండి. ఫోన్‌లో వ్యాసాలు,పుస్తకాలు చదవండి. విద్య విషయాలు సేకరించండి, ఆధునిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకొండి.

స్మార్ ఫోన్ అంటే అందరికీ ఇష్ట మే, కాని అది మన భవిష్యత్తును పాతాళంలోకి నెట్టకుండా చూసుకొండి. ఫోన్ యాప్ ఆవిష్కర్తలు చాలా తెలివైన వారు. అవి మన ఏకాగ్రతకు తెలియకుండానే గాలం వేసి లాగేసుకోగలవు. స్మార్ట్ ఫోన్‌పై పరిమిత ప్రేమను పెంచుకోండి. మన ఉత్పాదకత మన ధ్యాస మీదనే ఆధారపడుతుంది.

మన ధ్యాసను ఫోన్ ధ్వంసం చేసి మనల్ని చేతగాని వాడిగా మారుస్తుంది. మన ధ్యాసను మన అదుపులో పెట్టుకోవడానికి స్మార్ట్ ఫోన్‌కు పని వేళల్లో తాత్కాలికంగా విడాకులు ఇవ్వండి. జీవితాలను విజయ తోరణాలతో నింపేయండి. స్మార్ట్ ఫోన్ సాధనాన్ని స్మార్ట్‌గా వాడండి, స్మార్ట్‌గా సమాజం లో, చదువుల్లో, విధి నిర్వహణలో పేరు తెచ్చుకోండి. 

 డా. బుర్ర మధుసూదన్ రెడ్డి