రాష్ట్రంలో గ్రూప్-1 అభ్యర్థుల ఆందోళనలు హాట్ టాపిక్గా మారాయి. ఈ అంశంపై బీఆర్ఎస్, బీజేపీ ఒకే ఎజెండాతో కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. తమకు గొడ్డలిపెట్టుగా మారిన జీవో 29ను రద్దు చేయాలంటూ అభ్యర్థులు రోడ్డెక్కుతున్నారు. గ్రూప్-1 అభ్యర్థుల ఆందోళనలపై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల్లో చర్చ జరుగుతుండగా..
బీఆర్ఎస్ హయాంలో నిరుద్యోగుల ధర్నాలకు మద్దతుగా నిలిచిన ప్రొఫెసర్ కోదండరాం, తీన్మార్ మల్లన్న లాంటి కొందరు నేతలు ఇప్పుడు ఎక్కడ? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. నాడు నిరుద్యోగుల ఉద్యమాల కోసం రోడ్డెక్కిన వారి పలుకులు ఇప్పుడు బంగారమైనట్లు చర్చ జరుగుతోంది.