అశోక్ గజపతిరాజును ఆహ్వానించిన పీ రామచంద్రరాజు, గజల్ శ్రీనివాస్
హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి): డాక్టర్ పుసపాటి విజయరామ గజపతిరాజు శత జయంతి ఉత్సవా లు గుంటూరులోని శ్రీవెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో అక్టోబర్ చివరి వారంలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఠాగూర్ మె మోరియల్ ట్రస్ట్ కార్యదర్శి, రెడ్ క్రాస్ ఉపాధ్యక్షులు పీ రామచంద్రరాజు, ప్రముఖ గాయకులు డా.గజల్ శ్రీనివాస్ సోమవారం అశోక్ గజపతిరాజును ఆయన స్వగృహంలో కలిసి శత జయంతి వేడుకలకు విశిష్ట అతిథి గా రావాలని ఆహ్వానించారు.
ఈ సభకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును కూడా ఆహ్వానించామని తెలిపారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంస్థలను, నిస్వార్థంగా కృషిచేస్తున్న మహానీయులను, పౌర సంస్థల ప్రతి నిధులను ఆహ్వానిస్తున్నామని ఉత్సవ సంచాలకులు బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి, సహ సం చాలకులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి తెలిపారు.