హైదరాబాద్, అక్టోబర్ 16 (విజయక్రాంతి): ప్రముఖ ఆధ్యాత్మిక గు రువు శ్రీ రామధూత స్వామి ఆధ్వర్యంలో నవంబర్ 3వ తేదీన నాం పల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నిర్వహించే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అభిషేక మహోత్సవానికి హాజరవ్వాలని శ్రీ రామదూత స్వామి దివ్యధామం ప్రతినిధులు బుధవారం ఆర్అండ్బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి హైదరాబాద్లోని ఆయన నివాసంలో ప్రత్యేక ఆహ్వానం అందించా రు. అనంతరం వేదమంత్రోచ్ఛరణలతో స్వామిజీలు మంత్రిని ఆశీర్వ దించారు.
లోక కళ్యాణం కోసం ఈ కార్యక్రమాన్ని ఏటా నిర్వహిస్తున్నామన్నారు. ఈ ఊడాది నిర్వహించే అభిషేక మహోత్సవాన్ని మరింత ఘనంగా నిర్వహిస్తున్న దృష్ట్యా మం త్రిని ప్రత్యేకంగా ఆహ్వానించినట్టు ప్రతినిధులు తెలిపారు. ఆహ్వానం అందించిన వారిలో శ్రీ రాధాకృష్ణానంద దీక్షితులు, శ్రీ రమణానంద దీక్షితులు, శ్రీ పూర్ణానంద దీక్షితులు, శ్రీ విశ్వనాధ శర్మ ఉన్నారు.