హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 5(విజయక్రాంతి): పీఎం యశస్వి పథకం ద్వారా ఉపకార వేతనాల కోసం బీసీ, ఈబీసీ విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు హైదరాబాద్ జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి జి.ఆశన్న తెలిపారు. ఈ పథకానికి ఎంపికైన 9, 10వ తరగతి విద్యార్థులకు రూ.75వేలు, ఇంటర్మీడియట్ విద్యార్థులకు రూ.1.25 లక్ష ఉపకారవేతనం అందిస్తారన్నారు. గ్రామీణ ప్రాంతాల వారికి కుటుంబ వార్షిక ఆదాయం రూ.1.50లక్షలు, పట్టణ ప్రాంతంలోని వారికి రూ.2లక్షలకు మించరా దని తెలిపారు. దరఖాస్తు సమర్పణకు అక్టోబర్ 31 తుదిగడువుగా పేర్కొన్నారు.