calender_icon.png 24 September, 2024 | 6:50 AM

హెచ్‌సీఏలో అవకతవకలపై విచారణ చేయండి

24-09-2024 02:09:40 AM

విజిలెన్స్ డైరెక్టర్ జనరల్‌కు ఎంపీ చామల ఫిర్యాదు 

హైదరాబాద్, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)లో అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయని టీపీసీసీ ఉపాధ్యక్షులు, భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు ఆయన విజిలెన్స్ డైరెక్టర్ జనరల్‌కు ఫిర్యాదు చేశారు. అపెక్స్ కౌన్సిల్‌తో సంప్రదింపులు లేకుండానే కొంత మంది చేతుల్లోనే నిర్ణయాధికారాలు ఉన్నాయన్నారు. క్యారింగ్, రవాణా సేవల కోసం టెండర్ ప్రక్రియ వివాదం జరుగుతోందన్నారు. హెచ్‌సీఏ రోజువారి వ్యవహారాలపై రెగ్యులర్ అప్‌డేట్‌లను సీఈవో అందించడం లేదన్నారు. మీటింగ్ మినిట్స్ సర్క్యూలేట్ చేయడం లేదని, ఆర్థిక అక్రమాలు, ఆడిటర్ సిఫార్సులు ఇవ్వడం లేదన్నారు.