10-02-2025 10:15:57 PM
పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు, జనక్ ప్రసాద్...
మందమర్రి (విజయక్రాంతి): కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల నుంచి పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి ఐఎన్టియుసి నాయకులు తరలి వెళ్లారు. సోమవారం కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి కరీంనగర్ లోని ఎమ్మెల్సీ రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్ జనక్ ప్రసాద్ లతో పాటు కోల్ బెల్ట్ లోని ఐఎన్టీయూసీ నాయకులు ధర్మపురి, కాంపెల్లి సమయ్య, లక్ష్మీపతి గౌడ్, వికాస్ కుమార్ యాదవ్, ఏనుగు రవీందర్ రెడ్డి, అక్బర్ అలీ, శంకర్ నాయక్, దశరథం, సంగ బుచ్చయ్య, కొంగర రవీందర్, మల్లికార్జున్ లు పాల్గొని ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.