15-04-2025 07:22:23 PM
కొత్తగూడెం (విజయక్రాంతి): పీవీకే 5 ఉద్యోగి, కాంట్రాక్టుకార్మిక హక్కుల పరిరక్షణ సంఘం రాష్ట్రా అధ్యక్షులు రాసూరి శంకర్ పార్దివదేహానికి కొత్తగూడెం హనుమాన్ బస్తిలోని, స్వగృహాంలో ఐఎన్టియూసి నాయకులు మంగళవారం ఘననివాళి అర్పించారు. శంకరన్న కుటుంబన్ని ఓదార్చి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయుసి కేంద్ర కమిటీ సీనియర్ ఉపాధ్యక్షులు త్యాగరాజన్, కేజీఎం ఏరియా ఉపాధ్యక్షులు ఎండీ రజాక్, కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ పితాంభ్రం, డిప్యూటీ జనరల్ సెక్రటరీ బూటుక రాజేశ్వర్ రావు, ఏరియా చీఫ్ ఆర్గనైజేషన్ సెక్రటరీ ఎస్ కె గౌస్, సెంట్రల్ కమిటీ మెంబెర్ సకినాల సమ్మయ్య, చిలక రాజయ్య, వై శంకర్, అడప క్రిష్ణ, మంద సంజీవ్, జక్కుల సతీష్ పాల్గొన్నారు.