12-02-2025 07:19:08 PM
ఇల్లెందు (విజయక్రాంతి): సింగరేణి ఇల్లందు ఏరియా జి.యం. వి.కృష్ణయ్య ఆదేశాల మేరకు కారుణ్య నియామకాల కొరకు మెడికల్ ఇన్వాలిడేషన్ అయిన ఉద్యోగి వారసుడికి జి.యం కార్యాలయంలో బుధవారం ముఖాముఖీ (ఇంటర్వ్యూ) నిర్వహించారు. ఈ సందర్భముగా కే. రామదాస్ క్వాలిటీ మేనేజర్ మాట్లాడుతూ... ఇల్లందు సెక్యూరిటీ డిపార్టుమెంట్ నుండి కారుణ్య నియామకాల కొరకు మెడికల్ ఇన్వాలిడేషన్ అయిన ఉద్యోగి వారసుడికి వారి కుటుంబ సభ్యుల, సాక్షుల సమక్షంలో ఇంటర్వ్యూలు నిర్వహించి అన్ని వివరాలు నమోదు చేయడమైనదని, ఇంటర్వ్యూలు పూర్తి అయిన తరువాత అతనిని వైద్యపరీక్షల కొరకు పంపించి తరువాత నియామక ఉత్తర్వులు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డి.జి.యం.(పర్సనల్) జి.వి.మోహన్ రావు, ఏరియా సెక్యూరిటీ అధికారి అంజి రెడ్డి, క్లార్క్స్ రామకృష్ణ, అపర్ణ, రత్న కుమార్ తదితరులు పాల్గొన్నారు