calender_icon.png 27 September, 2024 | 6:51 AM

అంతర్రాష్ట్ర ఉద్యోగుల బదిలీలు త్వరగా చేపట్టాలి

26-09-2024 02:09:11 AM

డాక్టర్ ఎస్‌ఎం హుస్సేనికి ఉద్యోగుల విజ్ఞప్తి 

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి): ఉద్యోగుల అంతర్రాష్ట్ర బదిలీలు త్వరగా చేపట్టేలా తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలను కోరాలని టీఎన్జీవో కేంద్ర సం ఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్‌ఎం హుస్సేని (ముజీబ్)కి ఉద్యోగులు విజ్ఞప్తిచేశా రు. బుధవారం టీఎన్జీవో సంఘం, హైదరాబాద్ జిల్లా కార్యాలయంలో డాక్టర్ ముజీ బ్‌ను కలిసి తమ గోడు వెల్లబోసుకున్నారు.

ఈ సందర్భంగా ముజీబ్ మాట్లాడుతూ.. ఇరు రాష్ట్రాలు ఉద్యోగుల అంతర్రాష్ట్ర బదిలీలకు అంగీకరించాయని, తెలంగాణ ఉద్యో గులు ఇక్కడికి వస్తారని, ఆంధ్ర ప్రాంత ఉద్యోగులు వారి రాష్ట్రానికి వెళ్తారని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.