06-04-2025 12:15:09 AM
ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ
శేరిలింగంపల్లి, ఏప్రిల్ 5 (విజయక్రాంతి): అంతర్జాతీయ మహిళ దినోత్సవంను పురస్కరించుకుని చందానగర్ డివిజన్ పరిధి లోని క్రిస్టల్ గార్డెన్స్లో జరిగిన పి.ఆర్.కె చారిటబుల్ ఫౌండేషన్ చైర్మన్ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి సీనియర్ నాయకులు రఘునాథ్ రెడ్డితో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని విజేతలకు బహుమతులు ప్రధానంచేసి మహిళలకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ.
ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ...మహిళల కోసం ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించడం అభినందనీయం అని, అన్నారు. మహిళల కోసం సంస్కృతిక ప్రదర్శనలు, నిరుపేద మహిళలకు చీరల పంపిణీ, వంటి కార్యక్రమాలు నిర్వహించుకోవడం చాలా అభినదించదగ్గ విషయం అని, మహిళలు వంటింటికె పరిమితం కాకుండా అంది వచ్చిన అవకాశాలను పునికిపుచ్చుకొని అన్ని రంగాలలో ప్రావీణ్యం సాధించి ఉన్నత శిఖరాలను అధిరోహించి ఇతరులకు ఆదర్శంగా నిలీచీ ఆర్థిక స్వాలంబన పొందాలని తెలియచేశారు. ఈ కార్యక్ర మంలో నాయకులు, కార్యకర్తలు మహిళ సోదరీమణులు తదితరులు పాల్గొన్నారు.