21-02-2025 07:40:29 PM
మండల విద్యాధికారి కొడెపాక రఘుపతి..
చిట్యాల (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఘనంగా అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు భాష ఉపాధ్యాయుడు గడ్డం శంకర్, తుమ్మ మౌనిక ఆధ్వర్యంలో పాఠశాలలో విద్యార్థులందరికీ తెలుగు భాష గొప్పతనం తెలియజేస్తూ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా విద్యార్థులకు క్విజ్, ఉపన్యాసం కవితలు, వ్యాసరచన, డాన్సులు తదితర అంశాలలో విద్యార్థులకు పోటీలు నిర్వహించి బహుమతులు అందించారు.
ఈ సందర్భంగా విద్యాధికారి కొడెపాక రఘుపతి హాజరై మాట్లాడుతూ... మాతృభాష అమ్మ భాష అన్నారు. మాతృభాష మానవ జన్మకు ఒక వరమని దానిని బ్రతికించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. భవిష్యత్తులో అంతరించిపోయే భాషలలో దాదాపు 3 వేల భాషలు ఉన్నాయని తెలిపారు. అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ సందర్భంగా మాతృభాషలను ప్రతి ఒక్కరు బ్రతికించుకోవాలని వారి సాంస్కృతిక జీవవైవిద్యానికి మాతృభాష ఒక సూచిక అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు శ్రీరామ్ రఘుపతి, స్టాఫ్ సెక్రటరీ కూచనపల్లి శ్రీనివాస్, బొమ్మ రాజమౌళి, సాంబారు రామనారాయణ, తెలుగు భాష ఉపాధ్యాయులు గడ్డం శంకర్, సుజాత నీలిమారెడ్డి, విజయలక్ష్మి, ఉస్మానాలి కల్పన, గడ్డం శంకర్, తుమ్మ మౌనిక, పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ సూదం సాంబమూర్తి తదితరులు పాల్గొన్నారు.