calender_icon.png 28 September, 2024 | 1:02 PM

అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవ వేడుకలు

09-09-2024 01:37:22 PM

మంచిర్యాల విజయక్రాంతి : 58 వ అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని పట్టణంలోని గర్మిళ్ల పాఠశాలలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా అడల్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఏ పురుషోత్తం హాజరై విద్యార్థినీ విద్యార్థులకు అక్షరాస్యత మీద అవగాహన కల్పించారు. వయోజనులకు, నిరక్షరాశ్యులకు విద్య నేర్పడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరక్షరాశ్యత నిర్మూలనకు అధిక నిధులు వెచ్చించి కార్యక్రమాలు చేపడుతున్నట్టు వివరించారు. విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ మంచిర్యాల అధ్యక్షులు  బాల మోహన్, ప్రోగ్రాం చైర్ పర్సన్ వి మధుసూదన్ రెడ్డి, ప్రభుత్వ పాఠశాల హెడ్మాస్టర్ కే భీం రావ్, కార్యదర్శి చంద్రమౌళి, సీనియర్ మెంబర్స్ వినయ్ కుమార్, కొత్త సురేందర్, పోకల వెంకటేశ్వర్లు అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు.