బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణ పరిధిలోని ప్రగతి జూనియర్ కాలేజీ ఆర్థిక సంవత్సరం1997-99 విద్యను అభ్యసించిన విద్యార్థులు ఆదివారం రోజున బెల్లంపల్లి పట్టణంలోనీ పాలిటిక్స్ ప్రాంతంలో ఉన్న భవాని ఫంక్షన్ హాల్ లో సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంను కళాశాలకు సంబంధించిన విద్యార్థులు నిర్వాహకులైన గోపతి జనార్ధన్, లక్ష్మి, రవుఫ్ అనే పూర్వ విద్యార్థుల సమక్షంలో నిర్వహించగా అప్పటి ఎంపీసీ విద్యను బోధించే లెక్చరర్లు ఇంగ్లీష్ మాధ్యమాన్ని బోధించే శ్రీనివాసరావుతో పాటు, పలువురు వివిధ సబ్జెక్ట్ ను బోధించే లెక్చరర్స్ ఎండి అజీజ్, శ్రీనివాస్, సమ్మయ్య తదితర బోధన సిబ్బందిని శాలువాలతో పాటు పూలమాలను ధరింపజేసి సత్కరించి తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఈ ఈ సందర్భంగా పూర్వ విద్యార్థి అయిన గోపతి జనార్ధన్ మాట్లాడుతూ తమ భవిష్యత్తు దృష్ట్యా ఇంటర్మీడియట్ విద్యను అభ్యసించే క్రమంలో ఉన్నతమైన విలువలతో పాటు తమ భవిష్యత్తు పట్ల దిశా నిర్దేశం చేయడం తమ అదృష్టమని పేర్కొన్నారు.