calender_icon.png 4 October, 2024 | 2:57 AM

జానీ మాస్టర్‌కు మధ్యంతర బెయిల్

04-10-2024 12:54:46 AM

రాజేంద్రనగర్, అక్టోబర్ 3: కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు రంగారెడ్డి జిల్లా కోర్టు గురువారం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. తనపై జానీ మాస్టర్ లైంగిక దాడికి పాల్పడ్డాడని ఓ మహిళా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు లైంగిక దాడి, పోక్సో కేసు నమోదు చేసి చంచల్‌గూడ జైలుకు పంపించిన విషయం తెలిసిందే.

అయితే, తనకు నేషనల్ అవార్డు వచ్చిందని.. అవార్డు తీసుకోవడానికి ఢిల్లీ వెళ్లాల్సి ఉండడంతో బెయిల్ మంజూరు చేయాలని అభ్యర్థిస్తూ జానీ మాస్టర్ తన న్యాయవాది ద్వారా పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కోర్టు ఈ నెల 6వ తేదీ నుంచి 10 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కాగా, బెయిల్ ఇస్తే జానీ మాస్టర్ సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని పోలీసులు కోర్టుకు విన్నవించారు.