calender_icon.png 17 October, 2024 | 8:08 AM

ఆకునూరి మురళిని కలిసిన ఇంటర్ విద్యా జేఏసీ నేతలు

17-10-2024 03:36:36 AM

ఇంటర్ విద్య బలోపేతంపై సూచనలిచ్చిన నాయకులు

హైదరాబాద్, అక్టోబర్16(విజయ క్రాంతి): తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళితో ఇంటర్ విద్యా జేఏసీ నాయకులు బుధవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయనతో పలు అంశాలపై జేఏసీ చైర్మన్ డాక్టర్ మధుసూదన్ రెడ్డి, ప్రిన్సిపాల్స్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేఎస్ రామారావుతోపాటు ఇతర నేతలు చర్చించారు.

విద్యావ్యవస్థలో మార్పులు, జాతీయ నూతన విద్యా విధానం, ఇంటర్ విద్యలో నెలకొన్న కార్పొరేటీకరణ తదితర అంశాలపై చర్చించారు. ఇంటర్ విద్య బలోపేతానికి, ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మౌలిక వసతులు ఏర్పాటుపై కమిషన్‌కు సలహాలు, సూచనలు చేసినట్లు పేర్కొన్నారు. సమావేశంలో సంఘం నాయకులు కళింగ కృష్ణకుమార్, బలరాం జాదవ్, కనక చంద్రం తదితరులు పాల్గొన్నారు.