calender_icon.png 22 October, 2024 | 2:15 AM

ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

21-10-2024 12:06:28 AM

కోదాడ, అక్టోబర్ 20: సూర్యాపేట జిల్లా చిలుకూర్ సమీపంలోని కవిత జూనియర్ కళాశాలలో పాలకీడు మండలం సజ్జాపురం గ్రామా నికి చెందిన భీమన శంకర్, మంగ దంపతుల చిన్న కుమారుడు వినయ్ ఎంపీసీ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. దసరా సెలవుల సంద ర్భంగా ఇంటికి వెళ్లిన వినయ్‌ను తన మేనమామ లింగం నాగయ్య ఆదివారం ఉదయం కళాశాలకు తీసుకె ళ్లాడు.

కళాశాల నిర్వాహకులు విన య్ చదువులో వెనకబడి ఉన్నాడని, మార్కులు తక్కువగా వస్తున్నాయని నాగయ్యకు చెప్పారు. దీంతో మనస్థాపానికి గురైన వినయ్ మధ్యాహ్న భోజన సమయంలో గదిలో తువాలతో ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవన ర్మణానికి పాల్పడ్డాడు. ఎస్సై రాంబాబుగౌడ్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.