calender_icon.png 20 October, 2024 | 2:10 PM

ప్రేమోన్మాది పెట్రోల్ దాడిలో ఇంటర్ విద్యార్థిని మృతి

20-10-2024 10:43:26 AM

అమరావతి: వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ పట్టణంలో యువకుడి దాడిలో గాయపడిన ఇంటర్ విద్యార్థిని 80 శాతం కాలిన గాయాలతో మృత్యువాత పడింది. వివరాల ప్రకారం.. విఘ్నేష్ అనే ప్రేమోన్మాది బాలికను పీపీ కుంటలోని సెంచురీ ప్లైవుడ్ కంపెనీ సమీపంలోని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి పెళ్లి ప్రస్తావన తెచ్చి ఈ దారుణానికి పాల్పడ్డాడు. ప్రేమపేరుతో విద్యార్థిని పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తీవ్రంగా గాయపడిన బాలికను అత్యవసర వైద్యం కోసం కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించగా, ఆదివారం తెల్లవారుజామున ఆమె ప్రాణాలతో పోరాడి ఓడిపోయింది.

స్థానిక అధికారులు వెంటనే స్పందించారు, పోలీసులు ఆమె మరణానికి ముందు బాధితురాలి స్టేట్‌మెంట్‌ను సేకరించిన తర్వాత కేసు నమోదు చేశారు. ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజును సంప్రదించి వివరాలు తెలుసుకున్నారు. కాగా నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువతి మృతితో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేగింది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని మహిళ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.