హైదరాబాద్, అక్టోబర్ 15 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఆరోగ్య సేవల సామర్థ్యాన్ని పెంపొందించేందుకు గానూ ఆశా కార్యకర్తలు అందించే సేవలకు సంబంధించిన 17 వేర్వేరు రికార్డులను కలుపుతూ ఒక ఇంటిగ్రేటెడ్ రిజిస్టర్ను ఆవిష్కరించినట్లు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఒక ప్రకటనలో తెలి పారు. మంగళవారం గాంధీ హాస్పిటల్లో ఈ ఇంటిగ్రేటెడ్ రిజిస్టర్ను మంత్రులు దామోదర్ రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా ఆవిష్కరించినట్లు వెల్లడించారు.