19-03-2025 12:59:09 AM
నాగర్ కర్నూల్ మర్చి 18 (విజయక్రాంతి)నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం వట్టెం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో జాతీయ జెండాకు అవమానం జరిగినది. దుమ్ము దూళి వస్తోందని రక్షానకోసం జత్గీయ జెండాను అవమానకర విదంగా కట్టడంతో మంగళవారం గ్రామస్థులు, యువకులు పాఠశాల ప్రధానోపాధ్యాయుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
గణతంత్ర, స్వాతంత్య్ర దినోత్సవాళ్ళో జాతీయ జెండాను గ్రామాల్లో ర్యాలీ తీసి భద్రపరచమని పాఠశాలలో ఉంచగా పాఠశాల నిర్మాణ పనులు జరుగుతున్నాయని సాకుతో దుమ్ము దూలికి రక్షణగా కట్టినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చెప్పుకోవడం విశేషం. జాతీయ జెండాను గౌరవించాలని విద్యార్థులకు పాఠాలు చెప్పే హెడ్మాస్టర్ ఈ విధంగా వ్యవహరించడం పట్ల గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.