calender_icon.png 8 October, 2024 | 8:31 PM

రాచకొండ కమిషనరేట్‌లో భారీగా ఇన్‌స్పెక్టర్ల బదిలీ

08-10-2024 01:22:41 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): రాచకొండ కమిషనరేట్ లో భారీగా ఇన్‌ స్పెక్టర్ల బదిలీలు జరిగాయి. 27 మంది భారీగా ఇన్‌ స్పెక్టర్లను ట్రాన్స్ ఫర్ చేస్తూ సీపీ సుధీర్ బాబు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బదిల్లీలో సిబ్బంది పనితీరు ఆధారంగా పోస్టింగ్స్ ఇచ్చినట్లు పోలీస్ వర్గాలు వెల్లడించాయి.  చైతన్యపురి స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌గా ఉన్న జీ.వెంకటేశ్వర్లును కుషాయిగూడ డీఐగా బదిలీచేశారు. ఆ స్థానంలో రాచకొండ పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌ సీఐ జీ.వెంకటేశ్వర రావును నియమించారు. వనస్థలిపురం ఎస్‌హెచ్‌వో అశోక్‌ రెడ్డిని సైబర్‌ క్రైం పీఎస్‌కు బదిలీచేశారు. ఆయన ప్లేస్‌లో భూక్యా రాజేశ్‌ను ఎస్‌హెచ్‌వోగా ట్రాన్స్‌ఫర్‌ చేశారు.