నాగార్జున సాగర్, ఫిబ్రవరి 5 (విజయ్ర కాంతి) : నందికొండ మున్సిపాలిటీలోని పలు దుకాణాల్లో బుధవారం మున్సిపల్ అధికారులు తనిఖీలు చేశారు. మున్సిపల్ కమిషనర్ దండు శ్రీను ఆదేశాల మేరకు పలు హోల్సేల్ దుకాణాలు, హోటళ్లు, కూరగాయలు, బేకరీల్లో తనిఖీ చేసి ప్లాస్టిక్ కవర్లు వాడుతున్న పలువురు దుకాణాదా రులకు నోటీసులు ఇచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ వార్డు అధికారులు, పర్యావరణ ఇంజినీర్ తదితరులు పాల్గొన్నారు.