ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
హైదరాబాద్, అక్టోబర్ 25 (విజయక్రాంతి): కాంగ్రెస్ పాలనలో నిరు ద్యోగులకు అన్యాయం జరుగుతోందని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. శు క్రవారం తెలంగాణ భవన్లో మీడి యాతో మెతుకు ఆనంద్, బొమ్మెర రాంమూర్తి, రంగినేని అభిలాష్తో కలిసి మాట్లాడారు. గ్రూప్ 1పై హైకో ర్టు తీర్పు రాజ్యాంగబద్దంగానే వ స్తుందన్న నమ్మకం తమకుందన్నా రు.
బ్యాక్లాగ్ పోస్టులు లేకుండా గ్రూప్ 4 ఉద్యోగాలను భర్తీ చేయాలని సూచించారు. రేవంత్రెడ్డికి పో లీస్ శాఖపై శ్రద్ధ లేదని, ఏక్ పోలీస్ విధానాన్నే ఇక్కడా అమలు చేయాలన్నారు. సస్పెండ్ చేసిన అగ్రికల్చర్ ఆఫీసర్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రేవంత్ పాలనలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ ధర్నా చేసే పరిస్థితి వచ్చిందన్నారు. పెట్రో ల్ పోసి చంపుతానని మైనంపల్లి బెదిరింపులకు పాల్పడితే ఇప్పటి వరకు కేసులు పెట్టలేదన్నారు.