మాజీ మంత్రి హరీశ్రావు
హైదరాబాద్, అక్టోబర్ 1 (విజయక్రాంతి): ఎన్డీఆర్ఎఫ్ (వరదసాయం) నిధుల కేటాయింపులో తెలంగాణకు అన్యాయం జరిగిందని మాజీ మంత్రి హరీశ్రావు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఎక్స్ వేదిక ఆయన స్పందించారు. ‘తెలంగాణ రాష్ట్రం బీజేపీకి 8 ఎంపీ సీట్లు ఇస్తే రాష్ట్రానికి ఒరిగిందేమి లేదని దుయ్యబట్టారు. కేంద్ర బడ్జెట్ కేటాయింపులు, స్టేట్ స్పెసిఫిక్ గ్రాంట్లలో తెలంగాణకు మొండి చెయ్యి చూపిన ఎన్డీఏ సర్కార్.. ఎన్డీఆర్ఎఫ్ నిధుల కేటాయింపుల్లో కూడా అన్యాయం చేసిందన్నారు. ఆంధ్రప్రదేశ్తో పొల్చితే తెలంగాణకు సగం కంటే తక్కువ కేటాయింపులు చేసింది’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.