calender_icon.png 25 October, 2024 | 7:57 AM

అభివృద్ధి పేరుతో రైతులకు అన్యాయం

12-08-2024 02:23:55 AM

మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి

కొడంగల్, ఆగస్టు 11(విజయక్రాంతి): అభివృద్ధి పేరుతో రాష్ట్రప్రభుత్వం నిర్వాసిత రైతులకు అన్యాయం చేస్తోందని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి ఆరోపించారు. దుద్యాల మండలం హకీంపేట, పోలెపల్లి చౌరాస్తాలో ఆదివారం నిర్వాసిత రైతులు చేపట్టిన దీక్షకు ఆయన మద్దతు తెలిపారు. ఫార్మా కంపెనీ పేరుతో వివిధ ప్రాంతాల్లో 1,274 ఎకరాలు సేకరిస్తోందని అన్నారు. ఫార్మా కంపెనీతో గ్రామాల్లో కాలుష్యం బారిన పడతాయన్నారు. ప్రజలకు ఎలాంటి హాని లేని కంపెనీలను తీసుకురావాలని కోరారు. నాయకులు మధుసూదన్ యాదవ్, మహిపాల్, రామకృష్ణ, నారాయణరెడ్డి పాల్గొన్నారు.