19-04-2025 07:21:02 PM
అశ్వాపురం (విజయక్రాంతి): ఉపాధి హామీ కూలీలు పనికి వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా శనివారం మొండికుంట వద్ద అతివేగంగా వచ్చిన కారు డీకొని ఇద్దరు కూలీలకు గాయాలైనాయి. క్షతగాత్రులు మల్లెలమడుగు గ్రామానికి చెందిన వెలమ వసంత, కమటం వెంకన్నగా స్థానికులు చెప్పిన సమాచారం. మొండికుంటలో ప్రధమ చికిత్స అనంతరం వారిని మెరుగైన వైద్యం కోసం భద్రాచలం తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.