calender_icon.png 24 October, 2024 | 10:50 AM

అవిశ్వాసంపై జోక్యం చేసుకోలేం

11-07-2024 12:53:01 AM

బోడుప్పల్ మేయర్, డిప్యూటీ మేయర్ల వ్యాజ్యాలపై హైకోర్టు తీర్పు

హైదరాబాద్, జూలై 10 (విజయక్రాంతి): మేడ్చల్ మల్కాజిగిరిలోని బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ల అవిశ్వాస తీర్మానం ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టినట్లు కలెక్టర్ జారీ చేసిన నోటీసులను సమర్థిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోలేమలని మేయర్, డిప్యూటీ మేయర్ల అప్పీళ్లను కొట్టివేసింది. అవిశ్వాస తీర్మానం నిమిత్తం కలెక్టర్ జారీ చేసిన నోటీసులను సమర్థిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ మేయర్ సామల బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మిరవిగౌడ్ వేర్వేరుగా అప్పీళ్లు దాఖలు చేశారు. వీటిపై విచారించిన చీఫ్ జస్టిస్ ఆలోక్ ఆరాధే, జస్టిస్ అనిల్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం బుధవారం తీర్పు వెలువరించింది. జూన్ 21న కలెక్టర్ ఇచ్చిన నోటీసుపై సవాలు చెల్లదన్న వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది.