calender_icon.png 1 February, 2025 | 2:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ రాజ్యం.. ఇంటింటా సౌభాగ్యం

27-01-2025 12:08:51 AM

  • అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తాం 

మంత్రి దామోదర రాజనర్సింహ 

ఈసోజుపేట, నేరేడిగుంటలో సంక్షేమ పథకాలు ప్రారంభం

ఆందోల్ జనవరి 26 : ఇందిరమ్మ రా జ్యం ఇంటింటా సౌభాగ్యం అన్న నినా దంతో రాష్ర్ట ప్రభుత్వం రాష్ర్టంలో సంక్షేమ అభివృద్ధి పథకాలను అమలు చేస్తున్నదని రాష్ర్ట వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. ఆదివారంనాడు పుల్కల్ మండలం ఈసోజిపేట, అందోల్ మండలం నేరడిగుంట గ్రామాల్లో రాష్ర్ట ప్రభుత్వం ఆదివారం నుండి ప్రారంభిం చిన ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, రేష న్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కార్యక్రమాలను జిల్లాలో లాంచ నంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ కలెక్టర్ వల్లూరి క్రాంతితో కలిసి ప్రారంభిం చారు.

ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలలో మంత్రి మాట్లాడారు. ముందుగా ఆయా గ్రామాల లో ఏర్పాటు చేసిన సమావేశాలలో ముఖ్య మంత్రి సందేశాన్ని వినిపించారు.

అనంత రం ఆయా గ్రామాల్లోని లబ్ధిదారులకు ఆయా పథకాల మంజూరు పత్రాలను మంత్రి, కలెక్టర్ చేతుల మీదుగా అందజే శారు. ఇసోజుపేట గ్రామంలో 123 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూ రు చేసినట్లు మంత్రి తెలిపారు 1992లో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఇసో జి పేటలో నిరుపేద కుటుంబాలకు 200 ఎకరాల భూమి పంపిణీ, నేరడిగుంటలో గతంలో  250 ఇందిరమ్మ ఇండ్లు మంజూ రు  చేయడం జరిగిందన్నారు.

త్వరలో 168 కోట్లతో సింగూరు ప్రాజెక్టు నుండి అందోల్ నియోజకవర్గం లోని పంట పొలాలకు నీరు అందించే పంట కాలువల కు సిమెంట్ లైనింగ్ పనులు ప్రారంభిం చనున్నట్లు మంత్రి తెలిపారు. నియోజక వర్గంలో విద్యా వైద్య కళాశాలలో ఏర్పాటు చేసి నీటి తరం విద్యార్థులు విద్యాపరంగా అభివృద్ధి చెందేలా కార్యక్రమాలు చేపట్ట డం జరుగుతుందన్నారు.

ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాల ఫలాలు చిట్టచివరి ప్రజలకు చేరేవరకు సంక్షేమ పథకాలు నిరంతరముగా కొనసాగుతాయని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్  క్రాంతి మాట్లాడుతూ రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన నాలుగు సంక్షేమ పథకాలు అరులకు  అందేలా  చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల మంజూరు కార్యక్రమం నిరంతర ప్రక్రియ కొనసాగు తుందని విడతలవారీగా అరులందరికీ ఇందిరమ్మ ఇండ్లు  అందజేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు.

మొదటి దశలో పూర్తిగా ఇండ్లు లేని ఖాళీ స్థలం ఉన్న నిరుపేదలకు ఇండ్లు మంజూరు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ , డిఆర్‌డిఓ జ్యోతి, ఆందోల్ ఆర్డిఓ పాండు, జిల్లా పంచాయతీ అధికారి సాయిబాబా, హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్ చలపతిరావు, ప్రజాప్రతినిధులు  వివిధ శాఖల అధికారులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.