09-04-2025 07:00:14 PM
చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్, పెద్దపల్లి ఎంపీ వంశీ..
మందమర్రి (విజయక్రాంతి): నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి సొంత ఇంటి కళను నెరవేరుస్తామని చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణలు స్పష్టం చేశారు. మండలంలో పైలట్ ప్రాజెక్ట్ గా ఎంపికైన పొన్నారం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ నిర్వహించి మాట్లాడారు. మండలంలో తొలి విడత పైలట్ ప్రాజెక్టుగా ఎంపికైన పొన్నారం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లను మొదటి విడతలో నిర్మించడం జరుగుతుందని అర్హులందరూ ఇందిరమ్మ ఇంటి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
నిరుపేదలందరికీ నాణ్యమైన నివాసగృహాలను అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని వారు స్పష్టం చేశారు. త్వరలోనే నియోజకవర్గ వ్యాప్తంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారెంటీలను అమలు చేస్తుందన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులను గ్రామంలోని సమస్యలను అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రాజేశ్వర్ తహసిల్దార్ సతీష్ కుమార్, జిల్లా హౌసింగ్ పిడి బన్సిలాల్, కాంగ్రెస్ నాయకులు గందే రాంచందర్, మాసు సంతోష్ కుమార్, పెంచాల రాజలింగు, కొట్టే సంపత్ కుమార్ పటేల్, కడారి జీవన్ కుమార్, బేర సమ్మయ్య, కాపురపు సతీష్, భూషణం, రవి, అనిల్, పోచయ్య, రాములు పాల్గొన్నారు.