09-04-2025 05:05:05 PM
బిచ్కుంద (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం రాజులలో బుధవారం ఇందిరమ్మ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు పాల్గొని ఇంద్రమ్మ ఇండ్లను నిర్మించుకునే లబ్ధిదారులను ఎంపిక చేశారు. రాజుల గ్రామంలో 20 మంది లబ్ధిదారులను ఎంపిక చేశామని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి సుధీర్ కుమార్, జయ్ పటేల్, కాంగ్రెస్ పార్టీ నాయకులు అజయ్ పటేల్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.