15 June, 2026 | 9:58 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

భారత్ ఘన విజయం

14-01-2025 12:00 AM

కౌలాలంపూర్: ఐసీసీ మహిళల అండ ర్ టీ20 ప్రపంచకప్‌లో సోమవారం స్కాట్లాండ్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ భారత్ ఘన విజయాన్ని సాధించింది. మ్యాచ్‌లో భారత యువ జట్టు 119 పరుగుల తేడాతో భారీ గెలుపు అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన యంగ్ ఇండియా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది.

కమలిని (32) టాప్ స్కోరర్‌గా నిలవగా.. తెలుగు తేజం గొంగడి త్రిష (26), నికీ ప్రసాద్ (25) రాణించారు. అనంతరం స్కాట్లాండ్ జట్టు భారత బౌలర్ల ధాటికి 18.5 ఓవర్లలో 45 పరుగులకే కుప్పకూలింది. షబ్నమ్ షకీల్, వైష్ణవి, సోనమ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. శనివారం నుంచి మొదలుకానున్న టోర్నీలో భారత్ తొలి మ్యాచ్‌ను వెస్టిండీస్ తో ఆడనుంది. 2023లో సౌతాఫ్రికా వేదికగా జరిగిన తొలి అండర్ టీ20 ప్రపం చకప్‌లో భారత మహిళల జట్టు విజేతగా నిలిచింది.