న్యూఢిల్లీ: లావోస్ వేదికగా సెప్టెంబర్ 25 నుంచి 29 వరకు జరగ నున్న 2025 ఏఎఫ్సి అండర్ ఆసియా కప్ ఫుట్బాల్ క్వాలిఫయర్స్కు భారత కోచ్ రంజన్ చౌదరీ శనివారం 23 మందితో జట్టును ఎంపిక చేశారు. జట్టులో ముగ్గురు గోల్ కీపర్స్, ఎనిమిది మంది డిఫెండర్లు, ఆరుగురు మిడ్ఫీల్డర్లు, ఆరు గురు ఫార్వార్డ్ ప్లేయర్లు ఉన్నారు. భారత్ తమ తొలి మ్యాచ్ను సెప్టెంబర్ 25న మంగోలియాతో, సెప్టెం బర్ 27న ఇరాన్తో, సెప్టెంబర్ 29న లావోస్తో తలపడనుంది.