వియంటియాన్ (లావోస్) : ఏఎఫ్సీ అండర్-20 ఆసియా కప్ క్వాలిఫయర్స్ ఆడేందుకు భారత ఫుట్బాల్ జట్టు సోమవారం లావోస్లో అడుగుపెట్టింది. జట్టు హెడ్ కోచ్ రంజన్ చౌదరీ 23 మందితో కూడిన జట్టును ఎంపిక చేసిన సం గతి తెలిసిందే. గ్రూప్-జిలో ఉన్న భారత్ తమ తొలి మ్యాచ్ను ఈ నెల 25న మంగోలియాతో ఆడనుం ది. ఆ తర్వాత 27న ఇరాన్తో, 29న ఆతిథ్య లావోస్తో తలపడనుంది.