చెన్నై: చెన్నై లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్ట్ లో భారత బౌలర్ల దెబ్బకు బంగ్లాదేశ్ విలవిలలాడుతోంది. 92 పరుగులకే కీలకమైన ఏడు వికెట్లు కోల్పోయింది. నిప్పులు చెరిగే బంతులు విసిరిన భారత బౌలర్ల ముందు బంగ్లా బ్యాటర్ల వద్ద సమాధానమే లేకుండా పోయింది. మొదట్లో 40 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ ఆ జట్టును షకీబుల్ హసన్(32), లిట్టన్ దాస్(22) ఆదుకునే ప్రయత్నం చేశారు. ఈ ద్వయం 51 పరుగుల భాగస్వామ్యం అందించింది.
భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా, ఆకాశ్ దీప్, రవీంద్ర జడేజా చెరో రెండు పడగొట్టగా.. మహ్మద్ సిరాజ్ ఒక వికెట్ తీశాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్ 35 ఓవర్లు ముగిసే సరికి 7 వికెట్లకు 110 పరుగులు చేసింది. క్రీజులో మొహదీ మీర్జా(10), హసన్ ముహమూద్(09) ఉన్నారు. ఇంకా టీమిండియా కంటే బంగ్లా 266 పరుగులు వెనుకబడి ఉంది. అంతకు ముందే భారత్ తన తొలి ఇన్నింగ్స్ లో 376 పరుగులకు ఆలౌట్ అయిన విషయం తెలిసిందే.