calender_icon.png 22 September, 2024 | 3:05 PM

చెన్నై టెస్టులో భారత్ ఘన విజయం.. అదరగొట్టిన ఆర్ అశ్విన్

22-09-2024 12:38:24 PM

చెన్నై: తొలి టెస్టులో బంగ్లాదేశ్ పై భారత్ ఘన విజయం సాధించింది. తొలి టెస్ట్ మ్యాచ్‌లో నాల్గవ రోజు భారత్‌ 280 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ పై భారత్ గెలుపొందింది. భారత్ తొలి ఇన్నింగ్స్ లో 376, రెండో ఇన్నింగ్స్ లో 287/4, చేయగా బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ లో 149, రెండో ఇన్నింగ్స్ లో 234 పరులు చేసింది. రవిచంద్రన్ అశ్విన్ రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు పడగొట్టి బంగ్లాదేశ్‌ను చిత్తు చేశాడు. భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 234 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటో (82) పరుగులతో పర్వాలేదనిపించాడు. ఆదివారం జరిగిన రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. కాన్పూర్ వేదికగా ఈ నెల 27 నుంచి రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది.