calender_icon.png 27 September, 2024 | 3:18 AM

ఆసియా కప్‌లో భారత్ అదుర్స్

26-09-2024 12:00:00 AM

వియంటియానె (లావోస్): ఏఎఫ్‌సీ అండర్-20 ఆసియా కప్ క్వాలిఫయర్స్ మ్యాచులో భారత్ శుభారంభం చేసింది. బుధవారం జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 4-1 గోల్స్ తేడాతో మంగోలియాను మట్టికరిపించింది. తొలి హాఫ్ ముగిసే సరికి ఇరుజట్లు 1-1 తేడాతో సమంగా ఉన్నప్పటికీ రెండో అర్ధభాగంలో భారత ఫుట్‌బాల్ ఆటగాళ్లు దూకుడు కనబరిచారు. భారత్ తరఫున కెలివిన్ (ఆట 20వ నిమిషంలో), కిప్‌గెన్ (51, 54వ ని.లో), కోరు సింగ్ (85వ ని.లో) గోల్స్ సాధించారు. శుక్రవారం భారత్ తన రెండో మ్యాచులో ఇరాన్‌తో తలపడనుంది.