భారత్ vs న్యూజిలాండ్ 2వ టెస్ట్: పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) స్టేడియంలో జరుగుతున్న భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండవ టెస్ట్ 3వ రోజు టీమిండియా దూకుడు పెంచింది. భారీ లక్ష్య ఛేదనకు దిగిన భారత్ లంచ్ బ్రేక్ సమయానికి 1 వికెట్ కోల్పోయి 81 పరుగులు చేసింది. ఓపెనర్, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(08) మరోసారి విఫలమయ్యారు. యశస్వి జైస్వాల్(46), శుభ్ మన్ గిల్(21) దూకుడుగా ఆడుతూ పరుగులు స్కోర్ బోర్డు పరిగెత్తిస్తున్నారు. రెండో ఇన్నింగ్స్లో న్యూజిలాండ్ను 255 పరుగులకు ఆలౌట్ చేసింది. మూడు మ్యాచ్ల సిరీస్లో కివీస్ ఇప్పటికే 1-0 ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్ గెలవడానికి భారత్ కు ఇంకా 278 పరుగులు కావాల్సిఉంది.