calender_icon.png 17 October, 2024 | 2:02 PM

భారత్- న్యూజిలాండ్ టెస్టు మ్యాచ్‌కు వర్షం అడ్డంకి

17-10-2024 11:16:09 AM

బెంగళూరు వేదికగా భారత్- న్యూజిలాండ్ తొలి టెస్టు మ్యాచ్ కు వరుణుడు అడ్డం పడ్డాడు. వర్షం పడే సమాయానికి భారత్ 17 పరుగులు చేసి మూడు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో జైస్వాల్ (8), రిషబ్ పంత్ (3)పరుగులతో ఉన్నారు. న్యూజిలాండ్ తో జరుగుతున్న మ్యాచులో రోహిత్(02), విరాట్ కోహ్లీ, సర్ఫరాజ్ ఖాన్ డకౌట్ అయ్యారు. బెంగళూరు టెస్టులో టాస్ నెగ్గిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచులో శుభ్మన్ గిల్, ఆకాశ్ దీప్లకు విశ్రాంతి దొరికింది. సర్ఫరాజ్ ఖాన్, కుల్దీప్ యాదవ్లకు చోటు దక్కింది. కివీస్ కెప్టెన్ విలియమ్సన్కు గాయం కారణంగా మ్యాచ్కు దూరం అయ్యాడు.