calender_icon.png 17 October, 2024 | 3:31 PM

చేతులెత్తేసిన బ్యాటర్లు.. 46కే భారత్ ఆలౌట్

17-10-2024 01:36:16 PM

బెంగళూరు వేదికగా జరుగుతున్న భారత్, న్యూజిలాండ్ టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా చేతులెత్తేసింది. 31.1 ఓవర్లలో 46 పరుగులకే టీమ్ ఇండియా ఆలౌట్ అయింది. టెస్టుల్లో తమ మూడో అత్యల్ప స్కోరు చేసిన చెత్త రికార్డును భారత్ నమోదు చేసింది. ఈ మ్యాచ్ లో రిషబ్ పంత్ (20), జైస్వాల్(13) మినహా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్ కే ఔట్ అయిపోయారు. సిరాజ్(04), రోహిత్ శర్మ(02), కుల్ దీప్(02), బుమ్రా(01) ఖాతా తెరిచారు. ఈ మ్యాచులో హెన్నీకి 5 వికెట్లు, విలియమ్ ఓరూర్కెకు 4 వికెట్లు దక్కాయి. భారత్ ఇన్నింగ్స్ లో అత్యధిక భాగస్వామ్యం 21 పరుగులు. ఇన్నింగ్స్ మొత్తం మీద టీమిండియా 4 ఫోర్లు మాత్రమే కొట్టింది. 2020 అడిలైడ్ టెస్టులో ఆస్ట్రేలియా చేతిలో భారత్ 36 ఆలౌట్ అయింది. 1974 లార్డ్స్ టెస్టులో ఇంగ్లండ్ చేతిలో 42కే ఆలౌట్ అయింది.