calender_icon.png 9 October, 2024 | 3:52 AM

టోగోతో భారత్ ఢీ డేవిస్ కప్

08-10-2024 12:00:00 AM

లండన్: వచ్చే ఏడాది జనవరిలో జరగనున్న డేవిస్ కప్‌లో భారత్ తొలి మ్యాచ్‌ను పశ్చిమాఫ్రికా దేశమైన టోగోతో ఆడనుంది. వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్స్‌లో భాగంగా జనవరి 31 నుంచి  ఫిబ్రవరి 2 వరకు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ మేరకు అంతర్జాతీయ టెన్నిస్ ఫెడరేషన్ (ఐటీఎఫ్) సోమవారం డ్రా విడుదల చేసింది. మొత్తం 52 దేశాలు టోర్నీలో పాల్గొనుండగా.. గ్రూప్ 26, గ్రూప్ 26 దేశాలు కలిపి ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లు ఆడనున్నాయి. భారత తమ గ్రూప్ ప్లేఆఫ్ మ్యాచ్‌లను స్వదేశంలో ఆడనున్నట్లు భారత టెన్నిస్ సమాఖ్య పేర్కొంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో పాకిస్థాన్‌ను 4 చిత్తు చేసిన భారత్ వచ్చే ఏడాది వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ మ్యాచ్‌కు అర్హత సాధించింది.