న్యూఢిల్లీ: భూటాన్ వేదికగా జరుగుతున్న సాఫ్ అండర్-17 చాంపియన్షిప్లో భారత ఫుట్బాల్ జట్టు సెమీఫైనల్కు దూసుకెళ్లింది. మంగళవారం మాల్దీవ్స్తో జరిగిన మ్యాచ్లో భారత్ 3-0తో విజయం సాధించింది. భారత్ తరఫున శాంసన్ (ఆట 14వ నిమిషంలో) తొలి గోల్ అందించగా.. లుంకిమ్ (ఆట 74, 89వ ని.లో) డబుల్ గోల్స్తో మెరిశాడు. అంతకముందు 1-0తో బంగ్లాదేశ్ను మట్టికరిపించిన భారత్ 6 పాయింట్లతో గ్రూప్ టాపర్గా నిలిచింది. ఈ నెల 28న జరగనున్న తొలి సెమీస్లో గ్రూప్-బి నుంచి రెండో స్థానంలో నిలిచిన జట్టుతో తలపడనుంది.