calender_icon.png 11 October, 2024 | 2:58 AM

క్వార్టర్స్‌లో భారత్

03-10-2024 12:00:00 AM

న్యూఢిల్లీ: చైనాలో జరుగుతున్న బీడబ్ల్యుఎఫ్ వరల్డ్ జూనియర్ మిక్స్‌డ్ టీమ్ పోటీల్లో భారత జట్టు క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. గ్రూప్ చివరి మ్యాచ్‌లో భారత్ 110-99తో టర్కీని ఓడించి క్వార్టర్స్ బెర్తును ఖాయం చేసుకుంది. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (బీడబ్ల్యుఎఫ్) తొలిసారిగా రిలే స్కోరింగ్ పద్ధతిని ఈ టోర్నీలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. భారత జట్టు క్వార్టర్ ఫైనల్లో ఇండోనేషియాతో తలపడనుంది.