మహిళల టీ20 ప్రపంచకప్
న్యూఢిల్లీ: మహిళల టీ20 ప్రపంచకప్ను టీమిండియా సాధించే అవ కాశాలు మెండుగా ఉన్నాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ లీసా స్థాలేకర్ అభిప్రాయపడింది. ‘ వరుసగా నాలుగోసారి టైటిల్ సాధించే పనిలో ఉన్న ఆసీస్కు సెమీస్ వరకు ఎదురుండకపోవచ్చు. ఇంగ్లండ్ కూడా ఫేవరెట్గా ఉంది. ఈసారి సెమీస్లో అడుగుపెట్టే మరో జట్టు భారత్ అయ్యే అవ కాశముంది. ఫైనల్ చేరితే మాత్రం హర్మన్ సేన టైటిల్ కొట్టే చాన్స్ ఎక్కువగా ఉంది’ అని స్థాలేకర్ చెప్పు కొచ్చింది. అక్టోబర్ 3 నుంచి 20 వరకు యూఏఈ వేదికగా టీ20 ప్రపంచకప్ జరగనుంది.