calender_icon.png 14 October, 2024 | 2:44 AM

భారత్ ఓటమి

28-09-2024 12:00:00 AM

లావోస్: ఏఎఫ్‌సీ అండర్-20 ఆసియా ఫుట్‌బాల్ క్వాలిఫయర్స్‌లో భారత్‌కు ఓటమి ఎదురైంది. శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో భారత్ 0-1 తేడాతో ఇరాన్ చేతిలో పరాజయం పాలైంది. మ్యాచ్ 88వ నిమి షంలో ఇరాన్ తరఫున యూసెఫ్ మజ్రెక్ ఏకైక గోల్ సాధించాడు. మంగోలియాతో గెలిచిన ఆదివారం భారత్ లావోస్‌తో తలపడనుంది.

ప్రతి గ్రూప్‌లో టాప్‌లో నిలిచిన రెండు జట్లు 2025లో చైనాలో జరిగే టోర్నీలో పాల్గొననున్నాయి. మరోవైపు భూటాన్ వేదికగా జరుగుతున్న సాఫ్ అండర్-17 టోర్నీలో భారత జట్టు నేడు సెమీస్‌లో నేపాల్‌తో అమీతుమీ తేల్చుకోనుంది.