పుణె టెస్టు: శనివారం పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) స్టేడియంలో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్లో భారత్ రెండో ఇన్నింగ్స్లో న్యూజిలాండ్ను 255 పరుగులకు ఆలౌట్ చేసింది. మూడు మ్యాచ్ల సిరీస్లో కివీస్ ఇప్పటికే 1-0 ఆధిక్యంలో ఉంది. రెండో టెస్టులో గెలవడానికి, స్వదేశంలో తమ అజేయమైన టెస్ట్ సిరీస్ పరంపరను కాపాడుకోవడానికి భారత జట్టుకు 359 పరుగులు అవసరం. ఈ మ్యాచులో వాషింగ్టన్ సుందర్ 4 జడేజా 3, అశ్విన్ 2 వికెట్లు తీసుకున్నారు.
తొలి ఇన్నింగ్స్: న్యూజిలాండ్ 259, భారత్ 156